America :యెమెన్పై మళ్లీ అమెరికా దాడులు
యెమెన్లో రాజధాని సనాసహా హోదైద, అమ్రాన్ నగరాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో హోదైదలోని ఓడరేవు(Port), విమానాశ్రయం (Airport) తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముగ్గురు వ్యక్తులు చనిపోయారని హూతీ తిరుగుబాటుదారులు తెలిపారు. మరోవైపు హూతీలపై తమ దాడులు ఆగవని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితమే అమెరికా ఎర్ర సముద్రంలో నౌకాశ్రయంపై చేసిన దాడుల్లో 70 మంది చనిపోయారు. దాదాపు 171 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇదే అత్యంత తీవ్రమైంది. ఈ దాడిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ (Antonio Guterres ) స్పందించారు. ఈ చర్యలు తీవ్ర ఆందోళనకరమన్నారు. హూతీ రెబల్స్ (Houthi rebels) విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడంతో ఈ దాడులు జరుగుతున్నాయి.







