America : నదిలో కూలిన హెలికాప్టర్ .. ప్రముఖ కంపెనీ సీఈఓ కుటుంబం దుర్మరణం!
అమెరికాలోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో టెక్ దిగ్గజ కంపెనీ సిమెన్స్ సీఈవో అగస్టీన్ ఎస్కో బార్ (Augustine Esco Bar) దుర్మరణం చెందారు. మన్హట్టన్(Manhattan ) –న్యూజెర్సీ (New Jersey) మధ్యలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గింగిరాలు కొడుతూ నదిలో కూలిపోయింది. అగస్టీన్ కుటుంబ సమేతంగా న్యూయార్క్ (New York) నగర పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అగస్టీన్ భార్య, ముగ్గురు పిల్లలు, పైలట్ కూడా మృతి చెందారు. అధికారుల కథనం ప్రకారం నలుగురు ఘటనా స్థలిలో మృతి చెందగా, ఇద్దరు దవాఖానలో మరణించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.







