రోష్ని నాడార్కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం షెవెలియర్ డె లా లీజయిన్ డి హానర్ లభించింది. వ్యాపారం, స్థిరత్వానికి ఆమె సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారని పేర్కొంది. ఈ పురస్కారం స్వీకరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. భారత్`ఫ్రాన్స్ల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని ఇది సూచిస్తుందని రోష్ని నాడార్ తెలిపారు. హెచ్సీఎల్ టెక్ చాలా కాలం నుంచి ఫ్రాన్స్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫ్రాన్స్లో మా కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నాం. ఫ్రెంచ్ వ్యాపారాలు డిజిటల్ పరివర్తన దిశగా అడుగులు వేసేందుకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మా వద్ద ఉన్న వైవిద్యమైన సేవల పోర్ట్ఫోలియోతో వారికి సాయం అందిస్తామని రోష్ని తెలిపారు.






