వాట్సప్ వినియోగదారులకు శుభవార్త
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు వాట్సప్ శుభవార్త చెప్పింది. త్వరలో ఒకే యాప్లో రెండు వాట్సప్ ఖాతాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. అదీ లాగౌట్ కాకుండానే ప్రస్తుతం దాదాపుగా అన్ని ఫోన్లు రెండు సిమ్లతో వస్తున్నాయి. అధికారిక, వ్యక్తిగత నంబర్లను చాలా మంది వాడుతున్నారు. ఇప్పటిదాక ఒక నంబరుతోనే వాట్సప్ వినియోగించుకునే అవకాశముంది. రెండో నంబరును వాడాలంటే మొదటి నంబరు నుంచి లాగౌట్ అయి వినియోగించుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే ఫీచర్తో రెండు నంబర్లను ఉపయోగించుకుని రెండు ఖాతాలను నిర్వహించుకోవచ్చు. ఈ విషయాన్ని మెటా సీఈవో జుకర్బర్గ్ వెల్లడించారు.






