ఇక్కడ ఆ చట్టం అవసరం లేదు…

ప్రజాస్వామ్య దేశంలో 124ఎ చట్టం అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రశాష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 124ఎ చట్టం రాచరిక కాలం నాటి చట్టమని, ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఆ చట్టం అవసరం లేదని అన్నారు. బీజేపీ అనుకుంటే కేసీఆర్, జగన్ జైలుకెళతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ రద్దవుతుందని తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు మాట్లాడారని, బెయిల్ రద్దు అయితే జైలుకే కదా వెళ్ళాల్సింది అని అన్నారు. కేసీఆర్పై రెండు ఈడీ కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. కొందరు ఫోన్లు చేసి కవ్వింపులకు పాల్పడుతున్నారని అన్నారు. గోనెనన్ను గెలికితే అందరి బండారాలు పురాణాలుగా బయట పెడుతా అని హెచ్చరించారు.
వైఎస్ విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకంలో 172 పేజీలో తప్పులు రాసారని చెప్పారు. వైఎస్ పాదయాత్రలో సంఘీభావంగా ఉన్నారని అబద్దాలు రాశారన్నారు. వైఎస్ పాదయాత్ర జరిగినన్ని రోజులు అంబటి, లగడపాటి, భూమన కరుణాకర్ రెడ్డి, సుధీర్ రెడ్డిలు ఉన్నారన్నారు. జగన్ ఎక్కడా వైఎస్ పాదయాత్రలో పాల్గొనలేదన్నారు. అది నిజమని నిరూపిస్తే తిరుపతిలో ఊరేసుకుంటా అని సవాల్ విసిరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉండి షర్మిల దీక్షకు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా దీక్షలో ఎలా పాల్గొంటారన్నారు. వైఎస్ విజయమ్మకు, వైఎస్ జగన్ ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వలేదని ప్రశ్శించారు.