Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Ycp stand on amaravati 2

YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?

  • Published By: techteam
  • September 13, 2025 / 03:52 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Ycp Stand On Amaravati 2

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) వైఖరిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. మొదట్లో అమరావతికి జైకొట్టిన ఆ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల (3 capitals) నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ అమరావతే రాజధానిగా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో వైసీపీ స్టాండ్ మార్చుకుందని అర్థమవుతోంది. అయితే వైసీపీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇలా చెప్తున్న పార్టీ, రేపు అధికారంలోకి వస్తే మళ్లీ మాట మార్చదన్న గ్యారెంటీ లేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ ఓడిపోవడానికి అమరావతిని కాదనడం కూడా ప్రధాన కారణం అని, ఇప్పటికై ఆ పార్టీ రీయలైజ్ అయినందుకు సంతోషమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Telugu Times Custom Ads

2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అవసరం ఏర్పడింది. దీంతో అత్యాధునిక రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. దీనికి అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కూడా మద్దతు తెలిపారు. అయితే 2019లో టీడీపీ ఓడిపోయి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మార్చారు. అమరావతి నిర్మాణానికి పెద్దఎత్తున ఖర్చవుతుందని, అప్పుల్లో ఉన్న రాష్ట్రం అంత పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదన్నారు. అందుకే మూడు రాజధానులను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో అమరావతి రైతులు భగ్గుమన్నారు. అమరావతిని కాదని మూడు రాజధానులను తెరపైకి తీసుకురావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. న్యాయస్థానాలను ఆశ్రయించి అమరావతిని కాపాడుకున్నారు.

అయితే 2024లో తామే అధికారంలోకి వస్తామని, విశాఖ నుంచి పాలిస్తామని ఎన్నికల ముందు వైసీపీ నేతలు ప్రకటించారు. జగన్ కూడా త్వరలో తాను విశాఖ షిఫ్ట్ అవుతున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం రిషికొండ ప్యాలెస్ ను ఘనంగా నిర్మించారు. ఇంతలో 2024 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో మూడు రాజధానుల అంశం ముగిసింది. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని ప్రకటించింది. ఐదేళ్లపాటు ఆగిపోయిన రాజధాని పనులను మళ్లీ పునఃప్రారంభించింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో అమరావతిపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతి ఆగదనే నమ్మకం కలిగింది. అయితే ఎక్కడో ఏదో మూల మళ్లీ వైసీపీ వస్తే అమరావతిని తొక్కేస్తుందేమోననే భయం కొందరిలో ఉండేది. దానికి తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెక్ పెట్టారు.

విజయవాడలో శుక్రవారం ఓ డిజిటల్ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పరిపాలిస్తుందన్నారు. జగన్ కూడా విశాఖ వెళ్లరని స్పష్టం చేశారు. అయితే అమరావతిలో కాకుండా గుంటూరు, విజయవాడ మధ్య అమరావతి కట్టి ఉంటే ఖర్చు తగ్గేదన్నారు. అంతేకాక, నగరాన్ని నిర్మించాల్సిన అవసరం లేదని, ఇప్పుడున్న అసెంబ్లీ, సెక్రటేరియేట్ సరిపోతాయని సజ్జల అన్నారు. దీంతో అమరావతిపై వైసీపీ స్టాండ్ మార్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే సజ్జల ప్రకటనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. విశాఖ, కర్నూలు ప్రాంతవాసులను వైసీపీ మోసం చేసిందని కొందరు విమర్శిస్తున్నారు. మూడు రాజధానులను తెరపైకి తెచ్చి ఆ ప్రాంత వాసులను మభ్యపెట్టిందని, ఇప్పుడు ఆ పార్టీ అసలు స్వరూపం బయటపడిందని చెప్తున్నారు. మరికొందరు మాత్రం వైసీపీ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించినందుకు సంతోషించాలని చెప్తున్నారు. ఏదేమైనా అమరావతి విషయంలో గందరగోళానికి వైసీపీ చెక్ పెట్టింది. మరి ఇదే మాటపైన వైసీపీ మున్ముందు నిలబడుతుందా, లేకుంటే మళ్లీ మాట తప్పుతుందా అనేది వేచి చూడాలి.

 

 

 

Tags
  • Amaravati
  • AP Politics
  • ycp
  • YS Jagan

Related News

  • Mlc Bhumireddy Comments On Jagan

    MLC Bhumireddy : ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు :  ఎమ్మెల్సీ భూమిరెడ్డి

  • Bjp State President On Saarthyam Yatra

    PVN Madhav: వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు : పీవీఎన్‌  మాధవ్‌

  • Ab Venkateswara Rao Speech In Guntur

    ABV: ఏపీకి ఆ హక్కు ఉంది కానీ …తెలంగాణ అసత్య ప్రచారం : ఏబీవీ

  • Ponguru Narayana Met Patients

    Minister Narayana: ప్రజలెవరూ వదంతులు  నమ్మొద్దు : మంత్రి నారాయణ

  • Ayesha Meera Mother Press Meet

    Ayesha Meera: సీబీఐ కూడా మా బిడ్డకు న్యాయం చేయలేకపోయింది

  • Anagani Satya Prasad Comments On Jagan

    Minister Satya Prasad: వచ్చే ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడిస్తారు : మంత్రి అనగాని

Latest News
  • Mirai: సినిమాలో మ్యాట‌రుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
  • Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
  • Jagapathi Babu: రాజ‌కీయాల్లోకి వ‌స్తే నేనే హీరోను
  • YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
  • Priyanka:మన ప్రధానుల  సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
  • DGP Jitender: ఆమెకు రూ.25 లక్షల రివార్డు  ఇస్తున్నాం : డీజీపీ
  • MLC Bhumireddy : ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు :  ఎమ్మెల్సీ భూమిరెడ్డి
  • PVN Madhav: వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు : పీవీఎన్‌  మాధవ్‌
  • ABV: ఏపీకి ఆ హక్కు ఉంది కానీ …తెలంగాణ అసత్య ప్రచారం : ఏబీవీ
  • Minister Narayana: ప్రజలెవరూ వదంతులు  నమ్మొద్దు : మంత్రి నారాయణ
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer