తానా మహాసభలకు అతిథిగా.. కవయిత్రి చేబ్రోలు శశిబాల
అమెరికాలో ఈ నెల 7వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న తానా మహాసభలకు అతిథిగా హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ కవయిత్రి చేబ్రోలు శశిబాల కవయిత్రిగా వెళ్లనున్నారు. తాను ఈ సభల్లో పాల్గొనేందుకు ప్రత్యేక ఆహ్వానం లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎంతో విశిష్టత కల్గిన తానా సభల్లో వివిధ రంగాల్లోనిష్ణాతులైన వారికి ఆహ్వానం లభిస్తుందని, అలాగే తాను ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లడం రెండోసారి అని ఆమె తెలిపారు.
Tags :