కంగువ క్లైమాక్స్ కోసం భారీ తారాగణం
![కంగువ క్లైమాక్స్ కోసం భారీ తారాగణం](https://www.telugutimes.net/storage/news/news_new_73410.jpg)
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్ర చేస్తున్నాడు. ఈ రీసెంట్ గా రిలీజైన కంగువ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ కోసం రూ.10 కోట్లు ఖర్చైందని, సినిమా మొత్తాన్ని రూ.350 కోట్ల రూపాయలతో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ రీసెంట్ గానే వెల్లడించారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకనిర్మాతలు ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం పడ్డ కష్టాన్ని వివరించారు. వార్ సీక్వెన్స్ కు న్యాయం చేయడానికి ఏకంగా 10 వేల మందితో ఆ సీక్వెన్స్ ను తెరకెక్కించినట్లు తెలిపారు. యుద్ధ సన్నివేశానికి సంబంధించిన స్టంట్స్, యాక్షన్, విజువల్స్ ను అంతర్జాతీయ నైపుణ్యం కలిగిన టీమ్ పర్యవేక్షించిందని, ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా సినిమాటిక్ గ్రాండియరిటీని కంగువతో అందించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
వార్ సీక్వెన్స్ ను రియల్ గా 10,000 మందితో షూట్ చేశారంటే గ్రాఫిక్స్ లో దాన్ని లక్షలాది మంది వార్ లో పాల్గొన్నట్లు చూపించొచ్చు. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అందరికీ అంచనాలు బాగా పెరిగాయి. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)