సుప్రీంకోర్టు అరుదైన ఆదేశాలు.. వారికి మూడు వేలు ఇవ్వండి
![సుప్రీంకోర్టు అరుదైన ఆదేశాలు.. వారికి మూడు వేలు ఇవ్వండి](https://www.telugutimes.net/storage/news/news_new_73401.jpg)
సుప్రీంకోర్టు అరుదైన ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ వెలుపల యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కు హాజరయ్యే వారికి రోజుకు మూడు వేలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మే 26న యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ జరుగనున్నది. అయితే అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో మణిపూర్ అట్టుడిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్ వెలుపల పరీక్షా కేంద్రాలను మార్చాలని, రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతూ 140 మంది అభ్యర్థులు తొలుత ఢిల్లీ హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మణిపూర్లోని కొండ జిల్లాల అభ్యర్థులు ఎంచుకున్న ఇంఫాల్ పరీక్షా కేంద్రాన్ని మార్చడానికి అనుమతిస్తామని మార్చి 29న ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అలాగే వారికి ప్రయాణ ఏర్పాట్లు చేయడంతో పాటు ఖర్చుల నిమిత్తం రోజుకు రూ.1500 చొప్పున భత్యం ఇవ్వాలని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచించిన రోజువారీ భత్యాన్ని రూ.1,500 నుంచి 3,000కు సుప్రీంకోర్టు పెంచింది. ఈ ప్రయోజనం పొందాలనుకునే మణిపూర్ అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా వారి చిరునామా పరిధిలోని నోడల్ అధికారిని సంప్రదించాలని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)