తానా బహుజన శతక పద్యగానం
తానా 23వ మహాసభల సందర్భంగా వివిధ కార్యక్రమాలను మహాసభల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ సినీగీత రచయిత, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన బహుజన శతక పద్యగానంపై ఓ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జొన్నవిత్తులతోపాటు, తానా పూర్వఅధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు ప్రసాద్ తోటకూర, ప్రజాకవి అందెశ్రీ, తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహనరావు, బహుజనశతకం ఆంగ్లానువాదకవి డా. కలశపూడి శ్రీనివాసరావు పాల్గొంటున్నారు.
Tags :