ASBL NSL Infratech

రోబో మిత్రా ద్వారా సదస్సు ప్రారంభం

రోబో మిత్రా ద్వారా సదస్సు ప్రారంభం

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు-2017 హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్‌ఐసీసీ) వేదికగా ప్రారంభం అయ్యింది. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ-అతిథి ఇవాంక ట్రంప్‌ చేతుల మీదుగా రోబో మిత్రా ద్వారా సదస్సును ప్రారంభించారు. అనంతరం సదస్సు లోగోను ఆవిష్కరించారు. అమెరికా, భారత్‌ నీతి ఆయోగ్‌లు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు హోదాలో ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్‌ సదస్సుకు హాజరయ్యారు. నేడు, రేపు సదస్సులో పాల్గొననున్న ఇవాంక.. వ్యాపారరంగంలో మహిళలకు అవకాశాలు పెంచటం అనే అంశంపై ప్రసంగించనున్నారు. భారత్‌ లో స్టార్టప్స్‌కు ​సువర్ణావకాశంగా గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ 8వ సదస్సును పేర్కొంటున్నారు. ఇక మూడు రోజులపాటు కొనసాగే ఈ సమ్మిట్‌ కోసం సుమారు 150 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు, 300 మంది పెట్టుబడిదారులు  హాజరయ్యారు.

 

Tags :