ASBL NSL Infratech

ఇవాంకాతో మోదీ భేటీ

ఇవాంకాతో మోదీ భేటీ

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్)లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ మెట్రో రైలు ప్రారంభోత్సవం తర్వాత నేరుగా హెచ్‌ఐసీసీకి వెళ్లిన మోదీ.. మొదట ఇవాంకాతో సమావేశమయ్యారు. ఇవాంకా, మోదీతోపాటు రెండు దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాంకా అంతకుముందు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తోనూ భేటీ అయ్యారు.

Click here for Photogallery

Tags :