జీఈఎస్కు మానుషి చిల్లార్
ఈ నెల 28న హైదరాబాద్ నగరంలో జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్)లో ప్రపంచ సుందరి మానుషి చిల్లార్ పాల్గొననుంది. బాలీవుడ్ అంతాల తార దీపికా పదుకొణకు జీఈఎస్ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందినా అందుకు దీపికా పదుకొణ విముఖత చూపినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రపంచ సుందరి మానుషి చిల్లార్కు ఆహ్వానం పంపగా.. అందుకు ఆమె సుముఖత చూపడంతో.. 28న జరగనున్న జీఈఎస్ సదస్సులో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, ఇవాంక ట్రంప్తోపాటు ప్రపంచ సుందరి మానుషి చిల్లార్ పాల్గొననుంది.
Tags :