ASBL NSL Infratech

ఇవాంక టూర్‌ షెడ్యూల్లో మార్పు?

ఇవాంక టూర్‌ షెడ్యూల్లో మార్పు?

ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గారాల పట్టి ఇవాంకా టూర్‌ షెడ్యూల్‌ కాస్త మరినట్లు తెలుస్తోంది. ఇవాంక ట్రంప్‌ అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఈ నెల 28న బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ఖరారైన షెడ్యూల్‌ ప్రకారం ప్రధాని మోడీ బేగంపేట, ఇవాంక శంషాబాద్‌ విమానాశ్రయాలకు చేరుకుని అక్కడి నుంచి సమ్మిట్‌కు రావాల్సి ఉంది. మోడీ, ఇవాంకా ట్రంప్‌ ఒకే విమానాశ్రయం నుంచి వస్తే భద్రతా పరంగా కొంత అనుకూలంగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇవాంక ట్రంప్‌ భద్రతను అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ చూస్తున్నప్పటికీ తెలంగాణ నుంచి ఓ మహిళా ఐపీఎస్‌ అధికారి కూడా భద్రతా విధుల్లో పాలుపంచుకోనున్నారు. ఇప్పటికే ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు హోటల్‌ వెస్టిన్‌లో సమావేశమయ్యారు. ప్రముఖుల రాకపోకలు సాగించే మార్గాలు, ట్రాఫిక్‌ మళ్లింపు తదితర విషయాలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

 

Tags :