ASBL NSL Infratech

కేసీఆర్ స్వాగతోపన్యాసం

కేసీఆర్ స్వాగతోపన్యాసం

జీఈఎస్ లో సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం చేస్తు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి లభిస్తోందన్నారు. టీఎస్ ఐపాస్ విశిష్టమైన విధానమని, ప్రభుత్వం 15 రోజుల్లో అనుమతి ఇవ్వకుంటే, అది వచ్చినట్లుగానే భావించాలన్నారు. గత కొన్నేళ్లలో 5,469 ఇండస్ట్రియల్ యూనిట్లకు అనుమతి ఇచ్చామన్నారు. కొన్ని వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ తెలంగాణకు నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందన్నారు. ఇప్పుడు తెలంగాణ.. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్‌కు కేంద్రంగా మారిందని కేసీఆర్ అన్నారు.

Tags :