గురుప్రార్థనతో మొదలైన చండీయాగం
మెదక్జిల్లా ఎర్రవల్లిలోని వ్వవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం రెండోరోజుకు చేరింది. ఉదయం గురుప్రార్థనతో యాగం మొదలైంది. గోపూజ, ఏకదాశ న్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, మోగినీ బలి, మహాధన్వంతరీ యాగం, రాజశ్యామల చదుర్వేద మహారుద్ర పురశ్చరణలు, మహాసౌరము, ఉక్తదేవతా జపాలు, కుమారి, సువాసినీ, దంపతీపూజ, మహా మంగళహారతి, విశేష నమస్కారాలు నిర్వహించారు.






