Jairam Ramesh: భారత పాలసీలను ట్రంప్ ప్రకటిస్తారా?.. మోడీపై కాంగ్రెస్ ఫైర్
భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లను క్రమంగా తగ్గిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు ట్రంప్ ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ కేవలం దీపావళి శుభాకాంక్షలు తెలిపారని, అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని మోడీ (PM Modi) సోషల్ మీడియాలో చెప్పారని రమేశ్ గుర్తుచేశారు.






