India: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన!

భారత్పై అమెరికా సుంకాలు, ఉక్రెయిన్-రష్యా(Russia) యుద్ధం విరమణపై అస్పష్టత నేపథ్యంలో, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన నెలకొంది. భారత్పై తొలుత 25శాతం వాణిజ్య సుంకాలు విధించిన ట్రంప్ (Trump), తాము వద్దని చెప్పినా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ మరో 25శాతం సుంకాలు విధించారు. ఈ అంశం తేలేవరకు వాణిజ్య చర్చలు ఉండబోవని కూడా ప్రకటించారు.తొలి 25 శాతం సుంకంఇప్పటికే అమల్లోకి రాగా, అదనపు 25శాతం సుంకం ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు వాణిజ్య ఒప్పందంపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని, ఈ నెల 25 నుంచి 29 వరకు జరగాల్సిన ఆరో దశ చర్చల కోసం అమెరికా బృందం రానుందని భారత అధికార వర్గాలు తొలుత పేర్కొన్నాయి. కానీ అమెరికా బృందం పర్యటన రద్దయిందని తాజాగా కేంద్ర వాణిజ్యశాఖ వర్గాలు తెలిపాయి.