Devendra Fadnavis : అబద్ధాలపై నిర్మించిన కోట.. ఎన్నటికీ నిలువదు : దేవేంద్ర ఫడణవీస్
ఎన్నికల సంఘంతో బీజేపీ (BJP) కుమ్మక్కై ఓట్ల అవకతవకలకు పాల్పడినట్లు రాహుల్ చేసిన ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis ) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అబద్ధాల కోరు అని మండిపడ్డారు. రాహుల్ చేస్తోన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తున్నారు. ఇది వరకే నేను చెప్పాను రాహుల్ వట్టి అబద్దాల కోరని, ఆయన నిరంతరం అసత్యాలను ప్రచారం చేయడమే ఓ పనిగా పెట్టుకున్నారు. రాహుల్ మాట్లాడేదంతా అక్షర సత్యం అని భావించి కొందరు రాష్ట్ర నాయకులు నమ్మడం కన్ను కలచివేసింది. తప్పుడు సమాచారానికి ఆధారాలుండవు. అబద్ధాలపై నిర్మించిన కోట ఎన్నటికి నిలువదు అది కచ్చితంగా కూలిపోతుంది. ప్రజల ఓట్లు గెలవాలంటే వారి నమ్మకాన్ని సంపాదించాలని రాహుల్ గ్రహించలేకపోతున్నారు అని పేర్కొన్నారు.








