కేంద్రం ప్రభుత్వం శుభవార్త…
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి అదనంగా రూ.200 చొప్పున రాయితీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రక్షాబంధన్ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇంట్లో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో రూ.1103గా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్ కంపెనీలు, గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలను మాత్రం స్థిరంగా ఉంచుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్పై రూ.50 చొప్పున పెంచారు. 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం కింద 5 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చారు.






