CJI: తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్!
భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) ఎంపికయ్యే అవకాశాలున్నాయి. తదుపరి సీజేఐ (CJI) గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ (Justice B.R. Gavai) కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. ఈ మేరకు అధికారక వర్గాలు వెల్లడిరచాయి. సీజేఐ పదవీ విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది మే నెలలో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బి.ఆర్ గవాయ్ పదవీకాలం నవంబరు 23తో ముగియనుంది. దీంతో తదుపరి సీజేఐ నియామకం కోసం కేంద్ర ఇటీవల ప్రక్రియను ప్రారంభించింది.







