లండన్ పార్లమెంట్ వేదికగా అన్యూహారెడ్డి కి… అరుదైన పురస్కారం
యూకే పార్లమెంట్ నేతృత్వంలో అందజేసే అరుదైన పురస్కారం సేవా రత్న అవార్డు-2024 కు కోవిధ సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ జి.అనూహ్యారెడ్డి ఎంపికయ్యారు. ఫౌండేషన్ ద్వారా పేదలకు నిజాయితీగా అందించిన సేవలను గుర్తించి హైదరాబాద్ నగరానికి చెందిన కళాబంధు అనూహ్యా రెడ్డిని ఈ అరుదైన పురస్కారానికి ఎంపిక చేశారు. జూన్ 22వ తేదీన లండన్ పార్లమెంట్ వేదికగా హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఈ పురస్కారాన్ని ఆమె అందుకోనున్నారు. 2014 నుంచి కోవిధ సహృదయ ఫౌండేషన్ ద్వారా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నిస్వార్థంగా ఆమె పేదలకు అందించిన సేవలను సోషల్ మీడియా ద్వారా, వివిధ ఎన్జీవోల ద్వారా, టెలిఫోన్కి సర్వేల ఆధారంగా గుర్తించిన లండన్ పార్లమెంట్ వారు అనూహ్యా రెడ్డిని ఈ అత్యున్నత పురస్కారంతో సత్కరించనున్నారు.






