ప్రధాని మోదీకి అధినందనలు తెలిపిన పాక్ ప్రధాని
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీప్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏడు పొరుగు దేశాలను ఆహ్వానించినప్పటికీ, పాకిస్థాన్ కు మాత్రం భారత్ ఆహ్వానం పంపలేదు. దీంతో దాయాది దేశం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. అయితే గత ఫిబ్రవరిలో పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రిప్లయ్ కూడా ఇచ్చారు. తనకు అభినందనలు తెలియజేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు అని పేర్నొన్నారు.






