America : అమెరికాలో ఘోరం… భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య
అమెరికా లో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త దారుణహత్యకు గురయ్యారు. టెక్సాస్లోని ఆస్టిన్ ప్రాంతంలో ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై మరో భారతీయుడు దాడి చేసి హతమార్చాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతీయ సంతతికి చెందిన అక్షయ్ గుప్తా(30) హెల్త్- టెక్ స్టార్టప్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. మే 14న టెక్సాస్ (Texas)లో ఓ బస్సులో ప్రయాణిస్తుండగా ఆయన హత్య జరిగింది. బస్సులో వెనక కూర్చొన్న గుప్తాపై మరో భారతీయుడు దీపక్ కండేల్ (Deepak Kandel) దాడి చేసి హతమార్చాడు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గుప్తాను ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకపోయినా కండేల్ దాడి చేసినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా బయటపడిరది. వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నాం. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అక్షయ్ గుప్తా తన మామలా కనిపించడం వల్లే తాను అతనిని కత్తితో పొడిచానని నిందితుడు పోలీసుల (Police) కు పేర్కొనడం గమనార్హం.







