ద్వీప దేశానికి అండగా నిలిచిన భారత్… తక్షణ సాయం కింద
నైరుతి పసిఫిక్లోని ద్వీప దేశమైన పాపువా న్యూ గినియా లో తీవ్ర ప్రకృతి విపత్తు కారణంగా ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాజధాని పోర్ట్మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎంగా ప్రావిన్స్ లోని కవోకలామ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 2 వేల మంది సజీవ సమాధయ్యారు. ఈ విషాద సమయంలో ద్వీప దేశానికి భారత్ అండగా నిలిచింది. తక్షణ సాయం కింద 1 మిలియన్ డాలర్లు ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు విషాద ఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో ఉన్న పసిఫిక్ ద్వీప దేశానికి అన్ని రకాలుగా మద్దతు, సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.






