ఆర్బీఐ మరో కీలక నిర్ణయం
ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 31 వరకు పొడగించడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరో మూడు నెలల పాటు మారటోరియం పెంచే ఆలోచన చేస్తోంది. రుణాలు తిరిగి చెల్లించడంపై తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడగించే అవకాశం ఉందని ఎస్బీఐ పరిశోధన నివేదికలో తెలిపింది. కేంద్రం తాజాగా లాక్డౌన్ 4.0ను మే 31 వరకు పొడగించిన విషయం తెలిసిందే. మార్చి 1, 2020, మే 31 2020 మధ్య చెల్లించాల్సిన అన్ని టర్మ్ లోన్ల చెల్లింపుపై మార్చిలో ఆర్బీఐ మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని అనుమతించింది. అయితే ఇప్పుడు లాక్డౌన్ 31 వరకు పొడగించడంతో ఆర్బీఐ తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడగించాలని భావిస్తోందని. దీని ప్రకారం రుణాల చెల్లింపునకు మరో 3 నెలల మారటోరియం అవకాశం కల్పిస్తోంది.
అయితే తాజాగా లాక్డౌన్ పొడగించడంతో 2020 ఆగస్టు 31 వరకు కంపెనీలు చెల్లించనవసరం లేదని మరో మూడు నెలలు తాత్కాలిక నిషేధాన్ని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తరువాత సెప్టెంబర్ లో కంపెనీలు చెల్లించాల్సినవి వడ్డీతో కలిపి చెల్లించే అవకాశం కల్పించనున్నాయి. అయితే వడ్డీతో కలిపి లోన్లను తిరిగి చెల్లించడంలో విఫలం అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం అలాంటి వారి ఖాతాను నిరర్ధక రుణాలుగా వర్గీకరించవచ్చు. అయితే ఆర్బీఐ జూన్ 7న సర్క్యూలర్ బ్యాంకులకు పలు సౌలభ్యాన్ని ఇస్తుంది. సవరించిన పునర్ నిర్మాణ నిబంధనలు మార్చి 2021 వరకు వడ్డీ బాధ్యతలను టర్మ్ లోన్లుగా మార్చడం, వర్కింగ్ క్యాపిటల్ కోసం 3-5 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సినవి, టర్మ్ లోన్ల విషయంలో టేనర్ చివరిలో తిరిగి చెల్లించడం వంటి పునర్ నిర్మాణానికి బ్యాంకులకు ఇవ్వాలి అని ఆర్బీఐ నివేదికలో తెలిపింది.






