అస్సాం యువకుడి ఆవిష్కరణకు… రూ.416 కోట్లకు అమెరికా టెక్ దిగ్గజం
అస్సాంకు చెందిన ఓ కుర్రాడు అరుదైన ఘనత సాధించాడు. అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ రూ.416 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో యూఎస్ నుంచి దిబ్రూగఢ్కు చేరుకున్న ఆ యువకుడికి అతడి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. చారియాలీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా, నమీతా బగారియా కుమారుడు కిషన్ పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇటీవలే అతను అనే ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ను తయారు చేశాడు. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, మెసెంజర్, వాట్సప్ వంటి యాప్లలో ఉన్న కాంటాక్ట్స్తో ఈ యాప్ను ఉపయోగించి మెసేజ్లు చేసుకోవచ్చు. ఈ యాప్ను అమెరికా టెక్ దిగ్గజం ఆటోమేటిక్ సంస్థ కొనుగోలు చేయడంతో కిషన్ కోటీశ్వరుడిగా మారిపోయాడు.






