యాపిల్ కీలక నిర్ణయం.. 100 మంది ఉద్యోగులను
టెక్ దిగ్గజయం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాపిల్ కొత్త నియామకాలు తగ్గించుకున్న నేపథ్యంలో రిక్రూటర్ల అవసరం తగ్గింది. దీంతో ఆ విభాగంలో ఉన్న ఒప్పంద సిబ్బందిని సంస్థ తొలగించింది. 100 మంది ఒప్పంద రిక్రూటర్ల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వారికి రెండు వారాల వేతన చెల్లింపులతో పాటు ఇతర వైద్యపరమైన ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. అయితే పూర్తిస్థాయి రిక్రూటర్లను మాత్రం విధుల్లో కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక అవసరాల మేరకే ఈ కోతలు చేపట్టినట్లు యాపిల్ వివరణ ఇచ్చింది. యాపిల్లో ఉద్యోగులు కోతలు తప్పవని ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ గత నెలలోనే సూచన ప్రాయంగా వెల్లడింరచారు. ఖర్చు తగ్గింపుపై సంస్థ దృష్టి పెట్టిందని ఆయన అన్నారు.






