ASBL NSL Infratech

కరోనా టీకా తీసుకున్న యూపీ సీఎం

కరోనా టీకా తీసుకున్న యూపీ సీఎం

ఉత్తరప్రదేశ్‍ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‍ కరోనా వైరస్‍ టీకా తొలి డోసు వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా రెండో విడుత వ్యాక్సినేషన్‍లో భాగాంగా ఆయన లఖ్‍నవూలోని శ్యామ్‍ ప్రసాద్‍ ముఖర్జీ సివిల్‍ ఆస్పత్రికి వెళ్లి టీకా తీసుకున్నారు. భారత్‍ బయోటెక్‍ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‍ టీకాను ఆస్పత్రి సిబ్బంది ఆయనకు వేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‍ ద్వారా వెల్లడించారు. నేను ఈ రోజు దేశీయంగా రూపొందించిన కరోనా వైరస్‍ టీకా తీసుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలి. తద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని కరోనా రహితంగా తీర్చిదిద్దే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. అదేవిధంగా అందరూ కొవిడ్‍ జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలి అని  తెలిపారు. కరోనా టీకా ఉచితంగా లభించేలా చేసిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‍ షాకు ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్‍ రూపొందించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :