ASBL NSL Infratech

శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జీల ప్రమాణం

శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జీల ప్రమాణం

తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌ రావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో వారితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణం చేయించారు. ఇరువురూ దైవసాక్షిగా ప్రమాణం చేశారు. న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, సిబ్బంది హాజరయ్యారు. వారిద్దరూ 2022, జూలైలో అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.  సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల తర్వాత కేంద్రం గెజిట్‌ ప్రచురణ నేపథ్యంలో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :