దిశా కేసులో పోలీసులకు... హైకోర్టులో ఊరట
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట లభించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, పోలీసులు, షాద్నగర్ తహశీల్దార్పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దిశా నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ వేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి పలువురిని విచారించిన కమిషన్, ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలీసులపై హత్యనేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని పేర్కొంది. కమిషన్ నివేదిక సరిగ్గా లేదని పోలీసులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది.
Tags :