ASBL NSL Infratech

అమిత్ షా డీప్ ఫేక్‌ వీడియో కేసు నోటీస్ పై స్పందించిన రేవంత్ రెడ్డి..

అమిత్ షా డీప్ ఫేక్‌ వీడియో కేసు నోటీస్ పై స్పందించిన రేవంత్ రెడ్డి..

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించిన అమిత్ షా డీప్ ఫేక్‌ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాను చేయని పనికి ఎవరికీ భయపడేది లేదు అని స్పష్టం చేశారు. బీజేపీ పై పోరాడుతున్న వారికి అమిత్ షా నోటీసులు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. తనకు అందిన నోటీసులు కేవలం బీజేపీ ను ప్రశ్నించినందుకే అని చెప్పారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపడం బీజేపీ కు కొత్తేమీ కాదు అని ఆరోపించారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తో సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు CRPC-91 సెక్షన్ కింద ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోపక్క రిథోమ్‌ సింగ్‌ అనే వ్యక్తిని ఈ కేసు విషయంలో అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి ముఖ్య కారణం ఎవరు అన్న విషయం పోలీసు విచారణ లో త్వరలో స్పష్టం అవుతుంది.


 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :