బీజేపీని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు : సీఎం రేవంత్
అమిత్ షా వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో తనతోపాటు పలువురికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారని విమర్శించారు. బీజేపీని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. మోదీ ఇప్పటి వరకు విపక్షాలపై సీబీఐ, ఈడీని ప్రయోగించారని, ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు ఢిల్లీ పోలీసులనూ ప్రయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎవరూ భయపడేవాళ్లు లేరన్న రేవంత్, తెలంగాణ, కర్ణాటకల్లో బీజేపీని ఓడిరచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
Tags :