అమెరికాలోని అరిజోనా వేదికగా.. భారత్ స్టార్ అథ్లెట్ తేజస్విన్ కు స్వర్ణం
అమెరికాలోని అరిజోనా వేదికగా జరుగుతున్న అథ్లెటిక్స్ మీట్లో భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ హైజంప్లో స్వర్ణ పతకంతో మెరిసాడు. పురుషుల విభాగం హైజంప్ ఫైనల్స్లో తేజస్విన్ 2.23 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన ఎర్నెస్ట్ సియర్స్, మెక్సికో అథ్లెట్ రాబెర్టో విల్చెస్ కూడా 2.23 మీటర్ల ప్రదర్శన చేశారు కానీ శంకర్ మాత్రం తొలి ప్రయత్నంలోనే ఈ ఫీట్ను సాధించగా, వీరిద్దరూ రెండు, మూడు ప్రయత్నాల్లో అందుకున్నారు. దాంతో ఫైనల్ రౌండ్స్ ముగిసే సరికి ముగ్గురు కూడా (2.23 మీ)తో సమానంగా నిలిచారు. అయితే మొదటి ప్రయత్నంలోనే ఈ మార్క్ను అందుకున్న తేజస్వికి న్యాయ నిర్ణేతలు విజేతగా ప్రకటించడంతో అతడికి బంగారు పతకం సొంతమైంది. మరో భారత హై జంపర్ సర్వేశ్ కుషారే 2.13 మీటర్లతో ఐదో స్థానంలో సరిపెట్టుకున్నాడు.
Tags :