సెమీస్ లో కేసీఆర్..ఇప్పుడు ఫైనల్స్ లో మిగిలింది మోదీ నే.. రేవంత్ రెడ్డి..
తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన సెమీ పైనల్స్ వంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాం అని రేవంత్ అన్నారు. అయితే ఈసారి రాబోయే ఫైనల్స్ వంటి లోక్ సభ ఎన్నికలలో నరేంద్ర మోదీ ని ఓడించాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. జమ్మికుంట జనజాతర సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ జిల్లా ప్రజలు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమం జరుగుతున్న టైం లో కరీంనగర్ ప్రజలు కేసీఆర్కు అండగా నిలిచారని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాదు పదేళ్లలో తెలంగాణకు మోదీ ఇచ్చింది ఏమీ లేదన్న రేవంత్ రెడ్డి .. భావితరాలు బాగుండాలి అంటే ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని కోరారు.