ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న రామ్
ది వారియర్, స్కంద సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు రామ్ పోతినేని. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు రామ్. ఈ సినిమా కోసం రామ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే జూన్ లో డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకుల ముందుకొచ్చేది.
కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల సినిమాకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. రెండు, మూడు సాంగ్స్, కొంత టాకీ పార్ట్ మినహా షూటింగ్ పూర్తయిందని ఇన్ సైడ్ టాక్. రీసెంట్ గా ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడవడంతో దర్శకనిర్మాతలకు పెద్ద రిలీఫ్ వచ్చింది. ఇదిలా ఉంటే రామ్ త్వరలోనే డిజిటల్ డెబ్యూ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్ తో ఓ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ప్లాన్ చేయాలని నెట్ ఫ్లిక్స్ భావిస్తోందట. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను ప్రతిపాదనలతో తన దగ్గరికి పంపినట్లు తెలుస్తోంది. కథ నచ్చితే వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ రెడీ చేయనున్నారట. కానీ రామ్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోనట్లు తెలుస్తోంది. మరి రామ్ మనసులో ఏముందో తెలియాలంటే ఇంకాస్త టైమ్ పట్టనుంది. ప్రస్తుతం రామ్ ఫోకస్ అంతా డబుల్ ఇస్మార్ట్ పైనే ఉంది. ఆ సినిమాపై రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి డబుల్ ఇస్మార్ట్ తో రామ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అన్నది చూడాలి.