తమ లక్ష్యం నెరవేరే వరకూ దాడులు చేస్తాం : పుతిన్
ఉక్రెయిన్పై సుదీర్ఘకాలంగా యుద్ధం చేస్తున్న రష్యా తమ లక్ష్యం నెరవేరే వరకూ దాడులు చేస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అణ్వాయుధాల ప్రయోగానికి వెనకాడబోమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మరింత దూకుడు పెంచిన అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాఉaల మొదలు పెట్టాలని సైన్యాన్ని పుతిన్ ఆదేశించారు. విన్యాసాల్లో భాగంగా సన్నద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటామని, వ్యూహాత్మక అణ్వాయుధాలను వినియోగిస్తామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. మరికొన్ని రోజుల్లోనే వీటి కసరత్తు మొదలవుతుంది. రష్యాపై పాశ్యాత్య అధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు, బెదిరింపుల నేపథ్యంలో తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అణ్వాయుధ విన్యాసాల్లో గగనతల, నావికాదళాలు పాల్గొంటాయని ప్రకటించింది.
Tags :