జన్మభూమి స్ఫూర్తితో టీడీపీ విజయం కోసం.. ఎన్నారైలు కృషి
టీడీపీ ఎన్నారై విభాగం లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం హర్షణీయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. పలువురు ప్రవాసాంధ్రులతో కలిసి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగాలొచ్చేలా చూడటం యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం చంద్రబాబును గెలిపించాలని కోరేందుకు ఎన్నారైలు వచ్చి గ్రామాల్లో ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ జన్మభూమి స్ఫూర్తితో టీడీపీ విజయం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదేళ్లలో వైసీపీ నాయకులు యువతను గంజాయికి బానిసలుగా చేశారని మండిపడ్డారు. నియోజకవర్గానికి ఒక ఎన్నారై టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్లైన్ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, ఎన్నారైలు కిశోర్బాబు చలసాని, కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, రాజేష్ బాబు పోలేటి, యాష్ బొడ్డులూరి, డాక్టర్ హరిప్రసాద్ పాల్గొన్నారు.