ASBL NSL Infratech

పైన పటారం లోన లొటారం..ఇదే నేటి కూటమి పరిస్థితి..

పైన పటారం లోన లొటారం..ఇదే నేటి కూటమి పరిస్థితి..

ఆంధ్రా లో ఈ రోజు టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వేదికపై ఉన్న ఫ్లెక్సీలో ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఇతర ముఖ్య బీజేపీ కీలక నాయకుల ఫోటోలు లేకపోవడం పలు రకాల ప్రశ్నలకు దారితీస్తుంది. అక్కడ ఎక్కడ చూసినా కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలే ఉన్నాయి. అంతేకాదు ఈ విషయం పై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మేనిఫెస్టో విడుదల ఆలస్యమైందనే టాక్ వినిపిస్తోంది. మొదట మేనిఫెస్టో విడుదల 12 గంటల 30 నిమిషాలకు జరపాలని కూటమినేతలు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఫ్లెక్సీలో, మేనిఫెస్టో బ్రోచర్‌పై బీజేపీ నేతల ఫొటోలు లేకపోవడంపై జరిగిన చర్చల కారణంగా ప్రోగ్రాం అనుకున్న టైం కంటే కాస్త లేట్ అయింది.  మేనిఫెస్టో విడుదల లాంటి ముఖ్యమైన కార్యక్రమానికి బీజేపీ స్టేట్‌ చీఫ్‌ పురందేశ్వరి కూడా దూరంగా ఉన్నారు. మరోపక్క మేనిఫెస్టో విడుదల సమయంలో బ్రోచర్‌ను పట్టుకునేందుకు బీజేపీ నేత సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ సుముఖత చూపలేదు.ఇక లాస్ట్ లో సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఈ మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదని, బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ.. ఈ మేనిఫెస్టో కేవలం టీడీపీ.. జనసేనా పార్టీ లకి సంబంధించినది అన్నారు. అతని మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. ఇంత మాత్రానికి కూటమి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.



praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :