నిఖిల్ సినిమా ఆగిపోయినట్టేనా?
కార్తికేయ2 సినిమాతో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్లో దూసుకెళ్తున్నాడు. ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు నిఖిల్. స్వయంభు సినిమా కోసం నిఖిల్ ఎంతో కష్టపడుతున్నాడు. ఆ సినిమా కోసం ఏకంగా కత్తిసాము, యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు.
ఇప్పటివరకు స్క్రీన్ పై చూడని ఓ అరుదైన ఆవిష్కరణ ఈ సినిమాలో ఉంటుందని టాక్. ఇది కాకుండా చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందనున్న ది ఇండియా హౌస్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండూ కాకుండా నిఖిల్ మూడేళ్ల కిందట డైరెక్టర్ సుధీర వర్మతో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమాను మొదలుపెట్టాడు. రుక్మిణీ వసంత్, దివ్యంశ హీరోయిన్లు. సింగర్ కార్తీక్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా సెట్ చేసుకున్నారు.
ఈ సినిమాకు సంబంధించి చాలా భాగం షూటింగ్ కూడా విదేశాల్లో చేశారు. కొంత కాలం తర్వాత ఈ సినిమా గురించిన అప్డేట్స్ సడెన్ గా ఆగిపోయాయి. దానికి కారణం షూటింగ్ అయిన షూటింగ్ విషయంలో నిఖిల్ సంతృప్తికరంగా లేకపోవడమేనని తెలుస్తోంది. స్పై విషయంలో జరిగిన పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకూడదనే ఆలోచనతోనే నిఖిల్ ఈ సినిమాకు బ్రేక్ వేశాడని తెలుస్తోంది. ఫ్యూచర్ లో కూడా ఈ సినిమాను కంటిన్యూ చేస్తారనే గ్యారెంటీ లేదు.