ఈ పరిస్థితి మారాలంటే ఏపీలో.. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి : మోదీ
ఆంధ్రప్రదేశ్ వికాసమే తన లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. రాయలసీమ ప్రాంతంలో చైతన్యవంతులైన యువత ఉందన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు లేవు, యువత ఉపాధి కోసం వల వెళ్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసింది. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదు. పేదల వికాసం కోసం కాదు, మాఫియా కోసం వైసీపీ పనిచేసింది. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైంది. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. పుంగనూరులో ఐదేళ్లుగా రౌడీ రాజ్యం నడుస్తోంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాం. ప్రతీ ఇంటికి తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్కు వైసీపీ ప్రభుత్వం సహకారం అందించలేదు. ఐదేళ్లుగా రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం వస్తే సాగునీటి ప్రాజెక్టులన్నీ త్వరతగతిన పూర్తవుతాయి. ఉపాధి కోసం వలస వెళ్లేవారిని అన్నిరకాలుగా ఆదుకుంటాం. గల్ఫ్కు వెళ్లే భారతీయులు ఇప్పుడు గౌరవం పెరిగింది. ఖతార్లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా రప్పించాం. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదు. అధికారంలోకి వస్తే ఆర్టీకల్ 370ను మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతోంది. భారత్ విభిన్న జాతుల సముహం అని చెబుతోంది. తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అధికారం కోసం ఆ పార్టీ దేశాన్ని విభజించి పాలించాలని చూస్తోంది. బుల్లెట్ ట్రైన్ కావాలా? వద్దా? దక్షిణాదిలో కూడా బుల్లెట్ రైలు కావాలని బీజేపీ కోరుకుంటోంది. నంద్యాల`ఎర్రకుంట్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి. కడప`బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరైంది. కడప విమానాశ్రయం కొత్త టెర్నికల్ నిర్మాణంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల పనులు మరింత విస్తరిస్తాం. రైతుల జీవితాన్ని ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే మార్చగలుగుతుంది. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తాం అని మోదీ హామీ ఇచ్చారు.