వారిని గౌరవించకపోతే భారత్ పై అణు బాంబులు
లోక్సభ ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి పార్టీని ఇరుకునపడేశారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే దాయాదిని గౌరవించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. భారత్, పాక్ సంబంధాలపై మణిశంకర్ అయ్యర్ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్తో మనం చర్చలు జరపాలి. అంతేగానీ సైన్యంతో రెచ్చగొట్దొదు. అలా జరిగితే ఉద్రికత్తలు పెరిగి మనమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నాయి. అందువల్ల ఆ దేశాన్ని మనం గౌరవించాలి. వారిని గౌరవించకపోతే భారత్పై అణు బాంబులు ఉపయోగించాలని ఆలోచన చేస్తారు. మనవద్దా ఆ ఆస్త్రాలు ఉన్నాయి. కానీ లాహోర్పై మనం ప్రయోగిస్తే, దాని తాలూకు రేడియేషన్ అమృత్సర్ను చేరడానికి 8 సెకన్లు కూడా పట్టదు అని అయ్యర్ అన్నారు.