మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర జానపద కళాకారుడు మొగులయ్యను ఆదుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. మొగులయ్య కూలీ పని చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన కేటీఆర్ ఆయనను కలిసి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మొగులయ్యకు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ను పునరుద్ధరించడంతో పాటు అన్ని రకాల హామీలను నెరవేర్చాలని కేటీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. మొగులయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకు గర్వకారణమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. కాగా, కేటీఆర్ తనకు చేసిన సహాయానికి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు. రోజువారి జీవితం గడవడమే కష్టం ఉన్న ప్రస్తుత సందర్భంలో కేటీఆర్ చేసిన సహాయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Tags :