మొదటిసారి మోదీ ని నిలదీసిన జగన్..
జగన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎంతమంది గురించి మాట్లాడిన మోదీ గురించి మాత్రం నేరుగా ప్రస్తావించలేదు. మరి తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఢిల్లీ వాళ్ళు అనేవారు తప్ప నేరుగా ప్రధానమంత్రి పేరు చెప్పింది లేదు. అయితే ఈసారి జగన్ డైరెక్ట్ గా ప్రధానమంత్రి పేరు ప్రస్తావించడమే కాకుండా విమర్శలు కూడా కురిపించారు. 2014 నుంచి 2019 వరకు సుమారు ఐదు సంవత్సరాల పాటు జగన్ విపక్షంలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కోసం ఎన్ని సార్లు మాట్లాడిన కేవలం చంద్రబాబు సర్కార్ని టార్గెట్ చేశారే తప్ప ఎప్పుడూ మోదీ గురించి విమర్శించింది లేదు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత జగన్ మొదటిసారి డైరెక్టుగా మోదీ గురించి విమర్శించారు.
గాజువాక లో జరిగిన ఎన్నికల సభను వేదికగా చేసుకొని జగన్ మోదీ మార్క్ రాజకీయాల గురించి దుయ్యబెట్టారు. 2019 సమయంలో చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు అని విమర్శించిన మోదీ.. పోలవరం విషయంలో చంద్రబాబు గురించి ఎన్నో ఆరోపణలు చేసిన మోదీ.. ఇప్పుడు చంద్రబాబు గొప్ప పాలనా అధ్యక్షుడు అని కీర్తించడం వింతగా ఉంది అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు మారుస్తూ రాజకీయాలు చేయడంతో పాటు వెన్నుపోట్లు పొడవడంలో కూడా బాబు చాలా నిపుణుడు అని ఆనాడు విమర్శించిన మోదీ.. ఈనాడు అతనితో కలిసి కూటమిగా ఏర్పడడం చాలా గ్రేట్ అని పేర్కొన్నారు. వీళ్ళ మాటలు వింటుంటే రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతుంది అని జగన్ అన్నారు. తమను ఎదిరిస్తే విమర్శలు చేస్తారు, ఆరోపణలు చేస్తారు.. అదే తమ పక్కన నిలబడితే గొప్పగా కీర్తిస్తారు.. ఇదేనా మోదీ మీ రాజకీయం అని జగన్ నిలదీశారు.