వారిని అంతం చేయడమే తన లక్ష్యం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ విఫలం కావడంతో ఇజ్రాయెల్ సైన్యం రఫాపై దాడులు ప్రారంభించింది. లక్ష మంది పాలస్తీనా పౌరులు రఫా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు ప్రారంభమయ్యాయి. గాజా దక్షిణ భాగమైన రఫాలో హమాస్కు ఇంకా పట్టు ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. వారిని అంతం చేయడమే తన లక్ష్యమని నెతాన్యహు హెచ్చరించారు. సంధి ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా తమ దాడులు ఆగవని ఆయన తేల్చి చెప్పారు. రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతం జరుగుతుందని ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
Tags :