సింగపూర్ లో ఫోన్ పే యూపీఐ సేవలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సింగపూర్లో తమ ఖాతాదార్లు చెల్లింపులు చేయొచ్చని ఫిన్టెక్ సంస్థ ఫోన్పే వెల్లడించింది. ఈ మేరకు సింగపూర్ టూరిజమ్ బోర్డు (ఎస్టీబీ)తో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపింది. భారత్, సింగపూర్ల మధ్య ఇప్పటికే ఉన్న యూపీఐ అనుసంధానతపై ఈ ఒప్పందం కుదిరిందని, ఖాతాదార్లు తమ ప్రస్తుత భారతీయ బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా రెండు దేశాల మధ్య విదేశీ లావాదేవీలను ( క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్) తక్షణమే చేయడానికి అనుమతిస్తుందని పేర్కొంది.
Tags :