ASBL NSL Infratech

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి మృతి

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి మృతి

ఆస్ట్రేలియా లో కత్తి పోట్లకు గురై భారత విద్యార్థి నవ్‌జీత్‌ సంధు మృతి చెందారు. భారత విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో అతడు ప్రాణాలు కోల్పోయాడని మృతుడి బంధువు యష్‌వీర్‌ వెల్లడిరచారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఘటనలో మరో విద్యార్థి గాయాలపాలయ్యారు. అద్దె విషయంలో భారత్‌కు చెందిన కొందరు విద్యార్థులు ఘర్షణ పడుతుండగా, వారిని ఆపేందుకు వెళ్లి నవ్‌జీత్‌ ప్రాణాలు కోల్పోయాడని యష్‌వీర్‌ తెలిపారు. తాను ఉంటున్న ఇంటినుంచి వస్తువులు తెచ్చుకునేందుకు వెంట రావాలని సంధును అతడి స్నేహితుడు అడిగాడు. దాంతో ఇద్దరూ కలిసివెళ్లారు. తన స్నేహితుడు ఇంటి లోపలికి వెళ్లిన తర్వాత పెద్ద కేకలు వినిపించాయి. వారిమధ్య గొడవ జరుగుతుందని అర్థమై, సంధు కూడా లోపలికి వెళ్లాడు. ఘర్షణ వద్దని వారిని వారించే ప్రయత్నం చేశాడు. అప్పుడే అతడి ఛాతిలోకి కత్తి దూసుకెళ్లింది అని వెల్లడించారు. అతడిని తీసుకెళ్లిన మిత్రుడికి గాయాలయ్యాయని తెలిపారు. 

దీని గురించి ఆదివారం  ఉదయం తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ జులైలో నవ్‌జీత్‌ తను కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సి ఉందని, ఇంతలోనే ఇలా జరగడంతో అంతా షాక్‌లో ఉన్నామని వాపోయారు. మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. నవజీత్‌ హరియాణాలోని కర్నాల్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లారు. నిందితుడిది కూడా అదే ప్రాంతమని తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :