ASBL NSL Infratech

అమెరికా తర్వాత మనమే...

అమెరికా తర్వాత మనమే...

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. భారత్‍లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. 24 గంటల వ్యవధిలో 1,03,558 పాజిటివ్‍ కేసులు వెలుగుచూశాయి. 24 గంటల వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదైన తొలి దేశం అమెరికా. అక్కడ ఈ ఏడాది జవనరి 8న అత్యధికంగా 3.08 లక్షల పాజిటివ్‍ కేసులు బయపపడ్డాయి. అమెరికా తర్వాత భారత్‍లోనే రోజువారీ కేసులు అత్యధికంగా ఉన్నాయి. దీంతో మొత్తం పాజిటివ్‍ కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది. ఇందులో 1,16,82,136 మంది మహమ్మారి బారి నుంచి కోలుకోగా, 1,65,101 మంది బాధితులు మరణించారు.

రోజువారీ కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజురోజుకు యాక్టివ్‍ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 7,41,830 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 52,847 మంది వైరస్‍నుంచి కోలుకొని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా మరో 478 మంది మరణించారని వెల్లడించింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :