ASBL NSL Infratech

దేశంలో కరోనా విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 89,129 కరోనా పాజిటివ్‍ కేసులు నమోదు కాగా, 714 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం పాజటివ్‍ కేసుల సంఖ్య 1,23,92,260కు చేరగా, ఇప్పటివరకు 1,64,110 మంది ఈ వైరస్‍కు బలయ్యారు. ప్రస్తుతం 6,58,909 మందికి చికిత్స కొనసాగుతోంది. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,92,260కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 44,202 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.36 శాతం ఉండగా, మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. టీకా డ్రైవ్‍లో భాగంగా ఇప్పటి వరకు 7,30,54,295 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :