ఎన్నికల సమయంలో తెలంగాణలో భారీ నగదు స్వాధీనం..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.202 కోట్ల విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.76.65 కోట్ల నగదు రూపం కాగా.. రూ.43.57 కోట్ల వరకు మద్యం,రూ.29.62 కోట్ల వరకు విలువైన బంగారం వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటుగా మరో రూ.26.54 కోట్ల విలువైన 13.86 లక్షల వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాదులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రూ.1,96,70,324 నగదును సీజ్ చేశారు. హైదరాబాద్ లోని 8 ప్రదేశాలలో వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది కలిసి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. 7 వాహనాలలో రూ.1,81,70,324 నగదు బ్యాంకులకు తరలిస్తుండగా పట్టుబడింది. మొత్తానికి ఎన్నికల సమయంలో తెలంగాణ మొత్తం డబ్బుమయమైపోతుంది.
Tags :